Share News

Australia: ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్‌లో మునిగిపోయిన నలుగురు భారతీయులు..

ABN , Publish Date - Jan 25 , 2024 | 10:35 AM

ఆస్ట్రేలియా(Australia)లో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు(Indians) ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో జనవరి 25న మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు బీచ్‌లో ఈత కొడుతున్నారు.

Australia: ఆస్ట్రేలియాలో విషాదం.. బీచ్‌లో మునిగిపోయిన నలుగురు భారతీయులు..

సిడ్నీ: ఆస్ట్రేలియా(Australia)లో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు బీచ్‌లో మునిగి నలుగురు భారతీయులు(Indians) ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. విక్టోరియాలోని ఫిలిప్ ఐలాండ్ బీచ్‌లో జనవరి 25న మధ్యాహ్నం 3.30 ప్రాంతంలో(స్థానిక కాలమానం ప్రకారం) ముగ్గురు మహిళలు, ఓ పురుషుడు బీచ్‌లో ఈత కొడుతున్నారు.

అకస్మాత్తుగా ఓ రాకాసి అలా వారిని సముద్రంలోకి తీసుకెళ్లిపోయింది. గమనించి స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. వారు అక్కడికి చేరుకుని వారిని రక్షించడానికి ప్రయత్నించగా.. అప్పటికే ఇద్దరు మహిళలు, ఓ పురుషుడు మరణించాడని, స్పృహ కోల్పోయిన మరో మహిళను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వెల్లడించారు. వీరంతా భారత్‌కు చెందినవారని.. వీరి మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 25 , 2024 | 10:36 AM