Share News

తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో 525 మంది!

ABN , Publish Date - Apr 30 , 2024 | 05:06 AM

రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 525 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం

తెలంగాణ నుంచి లోక్‌సభ బరిలో 525 మంది!

సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది

ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 525 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఇతర ప్రధాన పార్టీలతోపాటు, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు 893 మంది నామినేషన్లు వేయగా.. వాటి పరిశీలన అనంతరం 625 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదం పొందాయి. కాగా, అందులో 100 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో 525 మంది ఈ ఎన్నికల్లో పోటీ పడనున్నారు.

Untitled-12.jpg

Updated Date - Apr 30 , 2024 | 05:06 AM