Share News

Tirumala : నడకదారిలో జంతు సంచారం పై ప్రత్యేక నిఘా..!

ABN , Publish Date - Mar 29 , 2024 | 09:55 AM

తిరుమలలో ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు జంతు సంచార కదలికలను గుర్తించి, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తిరుమల ఫారెస్ట్ ఉన్నతాధికారులు తెలియజేసారు.

Tirumala : నడకదారిలో జంతు సంచారం పై ప్రత్యేక నిఘా..!
tirumala

తిరుమలలో Tirumala 200 ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు జంతు సంచార కదలికలను గుర్తించి, భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నామని తిరుమల ఫారెస్ట్ ఉన్నతాధికారులు తెలియజేసారు.

ఫిబ్రవరి మాసంలో నడకదారిలో జంతు సంచారం ఎక్కడ కనపడలేదని కాబట్టి ఈ విషయంలో పెద్దగా భయపడాల్సిన విషయం కూడా లేదన్నారు. ఇక మార్చి నెలలో ఇప్పటి వరకు 5సార్లు చిరుత సంచరించినట్టు గమనించామని తెలిపారు. చిరుత సంచారం నేపథ్యంలో నడకదారిలో భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. ఏప్రిల్ మొదటి వారంలో మరో సారి ఫారెస్ట్ ఉన్నతాధికారులు నడకదారిలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతారని ఈ సందర్భంగా తెలియజేసారు.

మరిన్ని వార్తల కోసం లింక్ క్లిక్ చేయండి.

కమిటీ సిఫారస్సు మేరకు నడకదారిలో తీసుకోవాల్సిన చర్యల పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నడకదారిలోని అటవీ ప్రాంతంలోకి భక్తులు వెళ్ళడాన్ని నిషేదించారు. ఈ విషయంపై భక్తులు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. నడకదారిలో వెళ్లే భక్తులు గుంపులు, గుంపులుగా వెళ్ళాలని తెలిపారు. ఏనుగుల సంచారాన్ని గుర్తించడానికి ప్రత్యేక డ్రోన్ కెమెరాని తెప్పించామని ఈ సందర్భంగా తెలియజేసారు. డ్రోన్ కెమెరా ద్వారా ఏనుగుల సంచారాని గుర్తిస్తామని డిఎఫ్వో సతీష్ రెడ్డి తెలియపరిచారు.

Updated Date - Mar 29 , 2024 | 10:40 AM