Share News

Hyderabad: కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ

ABN , Publish Date - Feb 11 , 2024 | 12:32 PM

తాను అడిగిన చోట ఆర్టీసీ బస్సు ఆపలేదని ఆగ్రహంచిన ఓ మహిళ కండక్టర్‌ను చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన శివరాంపల్లి వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..

Hyderabad: కండక్టర్‌ను చెప్పుతో కొట్టిన మహిళ

హైదరాబాద్: తాను అడిగిన చోట ఆర్టీసీ బస్సు ఆపలేదని ఆగ్రహంచిన ఓ మహిళ కండక్టర్‌ను చెప్పుతో కొట్టింది. ఈ సంఘటన శివరాంపల్లి వద్ద శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. శివరాంపల్లికి చెందిన ప్రసన్న(35) శనివారం మెహిదీపట్నంకు చెందిన 300 నంబర్‌ బస్సును తాను నిలబడిన చోట ఆపమని చేయి చూపి అడిగింది. కానీ, డ్రైవర్‌ బస్సు ఆపలేదు. బస్టాప్‌లోకి వెళ్లి బస్సు ఆపారు. దీంతో ఆగ్రహించిన ప్రసన్న బస్టాప్‌లోకి వచ్చి బస్సు ఎక్కి కండక్టర్‌ నర్సింహతో గొడవపడింది. చెప్పు తీసుకుని కొట్టింది. ఈ ఘటనపై అత్తాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ పులి యాదగిరి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 11 , 2024 | 12:32 PM