Hyderabad: వామ్మో.. కళ్లలో కారం చల్లి.. మంగళసూత్రంతో పరారీ
ABN , Publish Date - Feb 08 , 2024 | 01:06 PM
ఓ మహిళ కళ్ళలో గుర్తుతెలియని మహిళ కారం చల్లి మంగళసూత్రాన్ని తెంచుకుని పరారైన సంఘటన మల్కాజిగిరి(Malkajigiri) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
![Hyderabad: వామ్మో.. కళ్లలో కారం చల్లి.. మంగళసూత్రంతో పరారీ](https://media.andhrajyothy.com/media/2023/20231205/city4_23fbafcaab.jpg)
- నిందితురాలి అరెస్ట్
మల్కాజిగిరి(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఓ మహిళ కళ్ళలో గుర్తుతెలియని మహిళ కారం చల్లి మంగళసూత్రాన్ని తెంచుకుని పరారైన సంఘటన మల్కాజిగిరి(Malkajigiri) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు నిదితురాలిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. మల్కాజిగిరి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. మిర్జాలగూడ ప్రాంతానికి చెందిన మునగాల రాధిక మంగళవారం తన ఇంట్లో పూజ చేసుకుంటుండగా ఓ అపరిచిత మహిళ వచ్చి రాధికతో మాట కలిపి ఇంట్లోకి వచ్చింది రాధిక కళ్ళలో కారం చల్లి ఆమె మెడలోని మంగళ సూత్రాన్ని తెంచుకుని పరారైంది. బాధితురాలు వెంటనే మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అప్రమత్తమైన పోలీసులు సీసీ ఫుటేజీ ఆదారంగా నిందితురాలిని గుర్తించారు. బుధవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నిందితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు కృష్ణాజిల్లా నందిగామ ప్రాంతానికి చెందిన చౌహాన్ పుల్లమ్మ(45)గా గుర్తించారు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో ఆమె వద్ద నుంచి చోరీకి గురైన మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆమెను రిమాండ్కు తరలించారు.