Share News

Hyderabad: చదువుతున్నది బీటెక్‌.. కానీ అతిగా మద్యం తాగి చివరకు ఏమయ్యాడో తెలిస్తే..

ABN , Publish Date - Feb 10 , 2024 | 12:55 PM

మద్యం అతిగా తాగి అనారోగ్యం కారణంగా వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బంజారాహిల్స్‌(Banjara Hills) పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: చదువుతున్నది బీటెక్‌.. కానీ అతిగా మద్యం తాగి చివరకు ఏమయ్యాడో తెలిస్తే..

హైదరాబాద్: మద్యం అతిగా తాగి అనారోగ్యం కారణంగా వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన బంజారాహిల్స్‌(Banjara Hills) పోలీస్ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఘండ్‌ రాష్ట్రానికి చెందిన హర్షిత్‌రాజ్‌ తివారి మల్లారెడ్డి కాలేజీలో 4వ సంవత్సరం బీటెక్‌ చదువుతూ కాలేజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. అయితే ఈనెల 6వ తేదీ 1.30 గంటల సమయంలో జార్ఖండ్‌ నుంచి పీయూ్‌షకుమార్‌ చౌబే తన వృత్తిపరమైన ట్రైనింగ్‌ కోసం కోల్‌కతా నుంచి నగరానికి వచ్చాడు. జూబ్లీహిల్స్‌ మెట్రోస్టేషన్‌ వద్ద అర్బనే స్టే లాడ్జిలో 203 రూంలో దిగాడు. ఇద్దరు బంధువులు కావటంతో రాత్రి పుల్‌గా మద్యం తాగారు. అయితే తెల్లవారిన తరువాత హర్షిత్‌రాజ్‌ వాంతులు చేసుకుని ఇబ్బందిగా ఉందని చెప్పాడు. దీంతో టిఫిన్‌ తిన్న తరువాత రెస్ట్‌ తీసుకోమని చెప్పి పీయూష్‌ ట్రైనింగ్‌కు వెళ్లాడు. అయితే మధ్యలో మందులు, కొబ్బరినీళ్లు కావాలని హర్షిత్‌రాజ్‌ ఫోన్‌ చేయగా అవి ఇచ్చి మళ్లీ ట్రైనింగ్‌ కోసం వెళ్లాడు. కాగా 7.30 గంటలకు పీయూష్‌ రూమ్‌కు వచ్చాడు. 8 గంటల సమయంలో బాత్‌రూమ్‌కు వెల్లిన హర్షిత్‌రాజ్‌ అకస్మాత్తుగా పడిపోయాడు. దీంతో 108లో ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే హర్షిత్‌రాజ్‌ మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Updated Date - Feb 10 , 2024 | 12:55 PM