Hyderabad: వామ్మో ఎంతఘోరం.. నిద్రిస్తున్న వ్యక్తిని లేపి డబ్బులు డిమాండ్.. లేవనడంతో హత్య
ABN , Publish Date - Jan 30 , 2024 | 12:13 PM
ఫుట్పాత్ పై నిద్రపోతున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వైఎంసీఏ(Secunderabad YMCA) సమీపంలో ఫుట్పాత్ పై ఓ వ్యక్తి నిద్రపోతున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి వద్దకు వెళ్లి లేపి డబ్బులు డిమాండ్ చేశారు.
![Hyderabad: వామ్మో ఎంతఘోరం.. నిద్రిస్తున్న వ్యక్తిని లేపి డబ్బులు డిమాండ్.. లేవనడంతో హత్య](https://media.andhrajyothy.com/media/2023/20231205/city2_46365cbf53.jpg)
- మరొకరిపై దాడి
- సికింద్రాబాద్లో ఓ ముఠా హల్చల్
రెజిమెంటల్బజార్(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ఫుట్పాత్ పై నిద్రపోతున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేశారు. ఆదివారం రాత్రి సికింద్రాబాద్ వైఎంసీఏ(Secunderabad YMCA) సమీపంలో ఫుట్పాత్ పై ఓ వ్యక్తి నిద్రపోతున్నాడు. గుర్తుతెలియని వ్యక్తులు అతడి వద్దకు వెళ్లి లేపి డబ్బులు డిమాండ్ చేశారు. లేవని చెప్పడంతో రేడియం స్టికర్ కట్ చేసే బ్లేడ్తో దాడిచేసి పారిపోయారు. సమాచారం అందుకున్న మార్కెట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియరాలేదు. అతడిపై దాడిచేసిన వారే గణేష్ టెంపుల్ వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మిశ్చిల్ అనే వ్యక్తిని డబ్బులు అడిగారు. లేవని చెప్పడంతో అతడిపై దాడి చేశారు. తప్పించుకోవడంతో గాయాలతో బయటపడ్డాడు. నిందితులను పట్టుకోవడానికి మార్కెట్ పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలిస్తున్నారు.