Chennai: పురుషుడిగా మారిన స్నేహితురాలి నుంచి ఎడబాటు.. మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
ABN , Publish Date - Mar 26 , 2024 | 01:45 PM
పురుషుడిగా మారిన స్నేహితురాలి నుంచి వేరు చేయడాన్ని జీర్ణించుకోలేని ఒక మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన తూత్తుకుడి జిల్లాలో జరిగింది.
చెన్నై: పురుషుడిగా మారిన స్నేహితురాలి నుంచి వేరు చేయడాన్ని జీర్ణించుకోలేని ఒక మహిళా కానిస్టేబుల్ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన తూత్తుకుడి జిల్లాలో జరిగింది. తూత్తుక్కుడి స్పిక్ నగర్కు చెందిన హరిప్రియ (28) అనే మహిళ తూత్తుకుడి సాయుధ విభాగంలో కానిస్టేబుల్. మొదటి భర్త నుంచి వేరు కావడంతో ఆరు నెలల క్రితం రెండో వివాహం చేసుకుంది. అయితే, యేడాదిన్నర క్రితం మదురై(Madurai)లో సాయుధ విభాగంలో శిక్షణ పొందే సమయంలో నవనీత ప్రియ(Navneetha Priya) అనే లేడీ కానిస్టేబుల్ పరిచయమయ్యారు. అప్పటి నుంచి వీరిద్దరు ప్రాణస్నేహితులుగా ఉంటూ లెస్బియన్స్గా మారారు. ఈ క్రమంలో నవనీత ప్రియ లింగమార్పిడి చికిత్స చేయించుకుని పురుషుడిగా మారింది. ఆ తర్వాత హరిప్రియ రహస్యంగా నవనీత ప్రియను వివాహం చేసుకుంది. అప్పటి నుంచి హరిప్రియ ప్రవర్తనలో మార్పు రావడంతో భర్త ఆంటోనీ జెనిత్ గుర్తించి వారిని వేరు చేశారు. దీన్ని జీర్ణించుకోలేని హరిప్రియ ఆదివారం ఆత్మహత్య చేసుకుంది.