Share News

Budget 2024: దేశంలో 1.47 కోట్ల మంది యువతకు శిక్షణ

ABN , Publish Date - Feb 01 , 2024 | 11:56 AM

దేశంలో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.47 కోట్ల మంది యువత శిక్షణ పొందారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పేర్కొన్నారు.

Budget 2024: దేశంలో 1.47 కోట్ల మంది యువతకు శిక్షణ

దేశంలో స్కిల్ ఇండియా మిషన్ ద్వారా 1.47 కోట్ల మంది యువత శిక్షణ పొందారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామని బడ్జెట్ ప్రసంగంలో భాగంగా పేర్కొన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన విస్తరిస్తుంది. చేపల ఉత్పత్తి రెండింతలు పెరిగింది. ప్రధాని మోదీ జై అనుసంధన్‌ అనే నినాదాన్ని గుర్తు చేశారు. దీనిని గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. 9 కోట్ల మంది మహిళల జీవితాల్లో మార్పు వచ్చింది. అంగన్‌వాడీ కార్యక్రమాలను వేగవంతం చేస్తామన్నారు.

మరోవైపు 54 లక్షల మంది యువతకు నైపుణ్యం కల్పించామని చెప్పారు. 3,000 కొత్త ఐటీఐలు, ఉన్నత విద్యాసంస్థల్లో 7 IITలు, 16 IIITలు, 7 IIMలు, 15 AIIMSలు, 390 విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. దీంతోపాటు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 43 కోట్ల రుణాలను మంజూరు చేశామని పేర్కొన్నారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారెంటీ పథకాలు మన యువతకు సహాయం చేస్తున్నాయని అన్నారు.


గత 4 ఏళ్లలో ఆర్థిక వృద్ధి వేగవంతమైంది. యువశక్తి సాంకేతిక ప్రణాళికను రూపొందిస్తుంది. మూడు రైల్ కారిడార్లను ప్రారంభించనున్నారు. ప్యాసింజర్ రైళ్ల నిర్వహణ మెరుగుపడుతుంది. ప్రధానమంత్రి గతి శక్తి యోజన కింద పనులు వేగవంతం చేయబడతాయి. సరుకు రవాణా ప్రాజెక్టు కూడా అభివృద్ధి చెందుతుంది. 40 వేల సాధారణ రైలు కోచ్‌లను వందే భారత్‌గా మార్చనున్నారు. విమానాశ్రయాల సంఖ్య పెరిగింది. వెయ్యి విమానాలకు ఆర్డర్లు ఇస్తూ ఏవియేషన్ కంపెనీలు ముందుకు సాగుతున్నాయి.

Updated Date - Feb 01 , 2024 | 11:59 AM