ఇందిరాగాంధీకి ఘన నివాళి
ABN , Publish Date - Nov 19 , 2024 | 11:46 PM
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించారు.
పుట్టపర్తిరూరల్, నవంబరు 19 (ఆంద్రజ్యోతి) : మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటా సత్యం మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి.. నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కదిరి అర్బన : మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఇందిరాగాంధీ సర్కిల్లో ఆమె చిత్రాపటానికి పూలమాలలు వేసి, నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కదిరిప్ప, కేఎస్ షాన్వాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.