Share News

సచివాలయమా..పార్టీ కార్యాలయమా..!

ABN , Publish Date - Feb 19 , 2024 | 12:08 AM

సాధా రణంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలపై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతుంది. కానీ పెదవేగి మండలం లక్ష్మీపురంలోని గ్రామ సచివాలయ భవనంపై వైసీపీ పతాకం ఎగురుతోంది.

సచివాలయమా..పార్టీ కార్యాలయమా..!
లక్ష్మీపురంలోని గ్రామ సచివాలయ భవనంపై ఎగురుతున్న వైసీపీ జెండా

లక్ష్మీపురం సచివాలయంపై వైసీపీ జెండా

పెదవేగి, ఫిబ్రవరి 18 : సాధా రణంగా ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలపై జాతీయ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతుంది. కానీ పెదవేగి మండలం లక్ష్మీపురంలోని గ్రామ సచివాలయ భవనంపై వైసీపీ పతాకం ఎగురుతోంది. నెలరోజుల కిందట గ్రామ సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ప్రారంభించారు. ఈ భవనంపై ఇటీవల జాతీయ జండాకు బదులుగా వైసీపీ జండాను ఏర్పాటు చేశారు. కొద్దిరోజులుగా భవనంపై పార్టీ జెండా ఎగురుతున్నా పట్టించుకునేవారే లేరు. ప్రభుత్వ భవనంపై వైసీపీ జెండాను ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Feb 19 , 2024 | 12:08 AM