Share News

కూటమి విజయానికి ఢోకా లేదు

ABN , Publish Date - May 29 , 2024 | 11:45 PM

: కైకలూరు నియోజకవర్గం నుంచి తాను విజయం సాధించగలనన్న విశ్వాసం ఉందని, ప్రజల మద్దతు తనకు విశేషంగా లభించిందని నియోజకవర్గ కూటమి అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ తెలిపారు.

కూటమి విజయానికి ఢోకా లేదు
పరసా ఏడు కొండలును బుధవారం కామినేని పరామర్శించారు

మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్‌

ముదినేపల్లి, మే 29 : కైకలూరు నియోజకవర్గం నుంచి తాను విజయం సాధించగలనన్న విశ్వాసం ఉందని, ప్రజల మద్దతు తనకు విశేషంగా లభించిందని నియోజకవర్గ కూటమి అభ్యర్థి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ తెలిపారు. ఇటీవల ముదినేపల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి పరసా ఏడు కొండలును బుధవారం కామినేని పరామర్శించారు. ఏడుకొండలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్‌డీఏ కూటమి అధికారంలోకి రావటం ఖాయమని, వైసీపీ నాయకులు తామే తిరిగి అధికారం చేపడతామని చెప్పుకోవటం హాస్యాస్పదమన్నారు. టీడీపీ కైకలూరు నియోజకవర్గ కో ఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ వీరమల్లు నరసింహారావు, పోల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జి కొడాలి వినోద్‌, పార్టీ నాయకులు బొర్రా చలమయ్య, పరసా విశ్వేశ్వరరావు ,యార్లగడ్డ గంగయ్య, వీరంకి చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెదగొన్నూరులో ఇటీవల మరణించిన దొడ్డిపట్ల వెంకటలక్ష్మి కుటుంబాన్ని కామినేని పరామర్శించారు. ఆమె భర్త టీడీపీ నాయకుడు సుధాకర్‌ను ఓదార్చారు. టీడీపీ, జనసేన నాయకులు వీరంకి వెంకటేశ్వరరావు, ముగ్గుళ్ల వెంకటేశ్వరరావు, గుడిసేవ సురేష్‌, పుప్పాల దుర్గా ప్రసాద్‌, చెల్లేటి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 29 , 2024 | 11:45 PM