తెల్లారిన బతుకులు
ABN , Publish Date - Mar 27 , 2024 | 01:03 AM
కాయ కష్టం చేసుకునే మహిళా రైతు కూలీలకు తెల్లవారక ముందే ఆటో రూపంలో మృత్యువు కబళించింది.
![తెల్లారిన బతుకులు](https://media.andhrajyothy.com/media/2024/20240326/26_agp_09_1a2ee770dc.jpg)
బైక్ను తప్పించబోయి మూడు పల్టీలు కొట్టిన ఆటో..
ఇద్దరి మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు
ఆగిరిపల్లి, మార్చి 26 : కాయ కష్టం చేసుకునే మహిళా రైతు కూలీలకు తెల్లవారక ముందే ఆటో రూపంలో మృత్యువు కబళించింది. ఆటో ప్రమాదంలో ఇద్దరు మహిళ లు మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది. ఆగిరిపల్లి మండలం సర్నాలగొల్లగూడెంకు చెందిన 22 మంది మహిళలు మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఒకే ఆటోలో గన్నవరం మండలం వెంపల్లికి పత్తి తీతకు బయల్దేరారు. వీరపనేనిగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి ఆటో అదుపు తప్పి మూడు పల్టీలు కొట్టింది. వీర్ల సుజాత(33) వీర్ల కృష్ణకుమారి(48) మృతి చెందారు. తీవ్ర గాయపడిన బడుగు శివమ్మ(46), సాకిరి నాగమణి, గుండ్రు పద్మావతిలను విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. మిగిలిన వారికి పిన్నమనేని సిద్థార్థ, నూజివీడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గన్నవరం మండలం ఆత్కూరు ఎస్ఐ పైడిబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.