Share News

నేడు టీడీపీలో చేరనున్న సారథి బృందం

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:14 AM

పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కొలు సు పార్థసారథి సోమవారం ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు సమక్షంలో తన అనుచరులతో ఆ పార్టీలో చేరనున్నారు.

నేడు  టీడీపీలో చేరనున్న  సారథి బృందం

నూజివీడు, ఫిబ్రవరి 25: పెనమలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే కొలు సు పార్థసారథి సోమవారం ఉదయం 10 గంటలకు టీడీపీ అధినేత చంద్ర బాబునాయుడు సమక్షంలో తన అనుచరులతో ఆ పార్టీలో చేరనున్నారు. తన కార్యాలయం నుంచి భారీ కాన్వాయ్‌తో మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకుం టారు. అక్కడ తన అనుచరులైన విజయవాడ వైసీపీ టౌన్‌ అధ్యక్షుడు బొప్పన భవకుమార్‌, ఇటీవలే వైసీపీలో కమ్మ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి రాజీనామా చేసిన చంద్రశేఖర్‌తో కలసి ఆయన టీడీపీలో చేరనున్నారు. ఇప్పటికే సారథికి నూజివీడు టీడీపీ అభ్యర్థిగా టిక్కెట్‌ కేటాయించిన విషయం తెలిసిందే. మంగళ వారం నూజివీడు రానున్న పార్థసారథి నూజివీడు మండలం సీతారాంపురం గ్రామం వద్ద నూజివీడు నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, నూజివీడు టౌన్‌కు చెందిన టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి భారీ ర్యాలీతో సారథి నూజివీడు మండలంలోని పలు గ్రామాల గుండా ప్రయాణించి నూజివీడు పట్టణం ద్వారా ఆగిరిపల్లి మండలం చేరుకుం టారు. సాయంత్రం ఆగిరిపల్లిలో భారీ సభలో ఆయన ప్రసంగిస్తారు. కార్యక్ర మాన్ని భారీ ఎత్తున జరిపేందుకు టీడీపీ యంత్రాంగం సమాయత్తం అవుతోంది.

Updated Date - Feb 26 , 2024 | 12:15 AM