Share News

వీధి కుక్కల దాడి.. ముగ్గురికి గాయాలు

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:07 AM

ఆగిరిపల్లి గ్రామంలో వీధికుక్కల బెడద ఎక్కువైంది.

 వీధి కుక్కల దాడి.. ముగ్గురికి గాయాలు

ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 18: ఆగిరిపల్లి గ్రామంలో వీధికుక్కల బెడద ఎక్కువైంది. గురువారం ముగ్గురు వ్యక్తులపై దాడి చేశాయి. రషీద్‌ (48) అనే వ్యక్తిని తీవ్రంగా గాయపరచడంతో వ్యాక్సిన్‌ ఇచ్చి డ్రెస్సింగ్‌ చేసి ఎక్స్‌రే నిమిత్తం నూజివీడు పంపారు. మరో ఇద్దరు గరిసేపల్లి కొండలు, మానేపల్లి నానికి చికిత్స చేశామని డాక్టర్‌ టీనా తెలిపారు. ఈ వీధికుక్కల వల్ల మండలంలో రోజుకు కనీసం 20 డోసులు యాంటీ ర్యాబిస్‌ వ్యాక్సిన్‌లు వేయవలసి వస్తోందని డాక్టర్‌ టీనా తెలిపారు.

Updated Date - Apr 19 , 2024 | 01:07 AM