పాలిటెక్నిక్ కళాశాల పేరు మార్చేశారు..
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:52 AM
కలిదిండి మండలం వెంకటాపురంలో వైఎస్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోర్డులో వైఎస్ఆర్ పేరును టీడీపీ నాయకులు సోమవారం తొలగించారు.
![పాలిటెక్నిక్ కళాశాల పేరు మార్చేశారు..](https://media.andhrajyothy.com/media/2024/20240604/10tpg2_9742ea837b.jpg)
కలిదిండి, జూన్ 10 : కలిదిండి మండలం వెంకటాపురంలో వైఎస్ఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బోర్డులో వైఎస్ఆర్ పేరును టీడీపీ నాయకులు సోమవారం తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు కురేళ్ల ఏడుకొండలు మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు వైఎస్ఆర్ పేరు అనధికారికంగా పెట్టారన్నారు. కూటమి అధికారంలోకి రావటంతో ఆ పేరును తొలగించి ఎన్టీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలగా బోర్డు ఏర్పాటు చేశామన్నారు. అయితే తాము శిలా ఫలకాలు కూడా ధ్వంసం చేశామని వార్తలు వెలువడడం అవాస్తవమన్నారు. టీడీపీ నాయకులు కొలా శ్రీకాంత్, గూడవల్లి శ్రీనివాసరావు, దాసరి బెనర్జీ, సానబోయిన విష్ణుమూర్తి, గూడపాటి శివరామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, కురేళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.