భక్తుడిలా వచ్చి అమ్మవారి..మంగళ సూత్రం కొట్టేశాడు
ABN , Publish Date - Apr 08 , 2024 | 12:03 AM
ఏలూరు సమీపంలోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి భక్తుడిగా వచ్చి దండం పెట్టుకున్నాడు. ఆ పై అటు ఇటు చూసి అమ్మవారి మెడలో ఉన్న ఏడు కాసుల బంగారు మంగళసూత్రాన్ని అపహరించుకుపోయాడు.
ఏలూరు క్రైం, ఏప్రిల్ 7 : ఏలూరు సమీపంలోని సత్రంపాడు సౌభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి భక్తుడిగా వచ్చి దండం పెట్టుకున్నాడు. ఆ పై అటు ఇటు చూసి అమ్మవారి మెడలో ఉన్న ఏడు కాసుల బంగారు మంగళసూత్రాన్ని అపహరించుకుపోయాడు. ఆ గుడి పూజారి తూటుకూరి నాగేశ్వరశర్మ ఏలూరు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వెంకటేశ్వరరావు సిబ్బందితో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. దర్యాప్తు నిమిత్తం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఉన్న సీసీ పుటేజీలను పరిశీలించారు. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. దొంగను ప్రాథమికంగా గుర్తించారు. అతనిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు.