ప్రశాంతంగా ముగిసిన టెన్త్ పరీక్షలు
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:21 AM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి.
ఆకివీడు/ఉండి/మొగల్తూరు/నరసాపురం/పాలకోడేరు/ఆచంట/పెంటపాడు, మార్చి 27: పదో తరగతి పబ్లిక్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఈనెల 18 నుంచి ప్రారంభమైన పరీక్షలు ఆకివీడు మండలంలో ప్రశాంతంగా జరిగా యి. ఓ ప్రైవేటు పాఠశాల సెంటర్లో సీఎస్, డీవో, ఇన్విజిలేటర్స్ సెల్ఫోన్లను బీరువాలో పెట్టుకోవడంతో అబ్జర్వర్ వచ్చి ఆ ఫోన్లను భీమవరంలోని డీఈవో కార్యాలయంలో అందజేశారు. అనంతరం వారితో లెటర్లు రాయించుకుని అం దించారు. ఉండి మండలంలో బుధవారం జరిగిన పరీక్షకు 12మంది గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొగల్తూరు మండలంలో 30 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో శామ్యూల్ జాన్ తెలిపారు. నరసాపురం పట్టణ, మండలంలో 40 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో పుష్పరాజ్యం తెలిపారు. పాలకోడేరు మండలంలో 703 మంది విద్యార్థులకు గాను 49 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో పీవీఎస్ నాగరాజు తెలిపారు. ఆచంట మండలంలో 542 మందికి 11 మంది, ప్రైవేట్ విద్యార్థులు 117 మందికి 47 మంది గైర్హాజరయ్యారని ఎంఈవో ఎ.ఉషారాణి తెలిపారు. పెంటపాడు మండలంలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని అధికారులు తెలిపారు.