Share News

చింతలపూడి అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:35 AM

‘చింతలపూడి అభివృద్ధే నా లక్ష్యం.. గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాది’ అని చింతలపూడి టీడీపీ కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌ అన్నారు.

చింతలపూడి అభివృద్ధే లక్ష్యం
ర్యాలీలో వాహనంపై మాట్లాడుతున్న రోషన్‌కుమార్‌

చింతలపూడి టీడీపీ కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌

చింతలపూడి, ఏప్రిల్‌ 19: ‘చింతలపూడి అభివృద్ధే నా లక్ష్యం.. గెలిపించుకోవాల్సిన బాధ్యత మీది, అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మాది’ అని చింతలపూడి టీడీపీ కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌ అన్నారు. చింతలపూడిలో శుక్రవారం రాత్రి కూటమి ఆధ్వర్యంలో నిర్వహించిన యువజాతర ర్యాలీ హోరెత్తింది. బైపాస్‌ రోడ్డునుంచి బోయగూడెం షాదీఖానా వైపు యువతీయువకులు నినాదాలు, మూడుపార్టీల జెండాల రెపరెపలు, బాణసంచా కాల్పులతో ర్యాలీ హోరెత్తించారు. బోసుబొమ్మ సెంటర్‌, ఫైర్‌స్టేషన్‌ సెంటర్‌లలో ఆయన మాట్లాడుతూ గెలిచిన కొద్దిరోజుల్లోనే చింతలపూడిలో సెంట్రల్‌ లైటింగ్‌, నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితిని వెంటనే పరిష్కారం చేస్తానన్నారు. ఎన్‌ఆర్‌ఐగా సంపాదించుకుని వచ్చానని, డబ్బుకోసమో, కమీషన్‌ల కోసమో రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. తనతో పాటు ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్‌యాదవ్‌ను గెలిపించే బాధ్యత యువనాయకులదేనన్నారు. మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ మాట్లాడుతూ ఇటువంటి యువనేతలను గెలిపిం చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. టీడీపీ నాయకులు జె.ముత్తారెడ్డి, మా టూరి వెంకటరామయ్య, జనసేన నాయకులు చీదరాల మధుబాబు, బీజేపీ నాయకులు తోట వెంకటనారాయణ, దాసరి శ్యామ్‌చంద్రశేషు, పలువురు నాయకులు పాల్గొన్నారు. పలు గ్రామాల నుంచి యువజాతర పేరుతో ర్యాలీలో అధిక సంఖ్యలో యువనాయకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:35 AM