Share News

ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:39 AM

‘కూటమి అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ప్రచారంలో భాగంగా ఎంతోమంది పలు సమస్యలు తెలుపుతు న్నా రు.

ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం
జంగారెడ్డిగూడెంలో ప్రజలకు నమస్కరిస్తున్న రోషన్‌కుమార్‌

చింతలపూడి ఎమ్మెల్యే ఉమ్మడి అభ్యర్థి సొంగా రోషన్‌

చింతలపూడి, ఏప్రిల్‌ 18 : ‘కూటమి అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ప్రచారంలో భాగంగా ఎంతోమంది పలు సమస్యలు తెలుపుతు న్నా రు. అవన్నీ పరిష్కరించేవే. కానీ ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కన్పిస్తోంది. స్థానిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించే బాధ్యత నాది. ఇది నా హామీ’ అని చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్‌కు మార్‌ అన్నారు. గురువారం సూపర్‌ సిక్స్‌, శంఖారావం పథకాలను జంగారెడ్డిగూ డెం పట్టణంలోని 9,10,11వ వార్డుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పట్టణంలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి, భవిష్యత్తు తరాలకు, యువత భవిష్యత్తుకు లక్షల ఉద్యోగాలు రావాలన్నా, రోడ్లు అభివృద్ధి చెందాలన్నా, ఆగిన కార్పొరేషన్‌ రుణాలు మళ్లీ తిరిగి రావాలన్నా చంద్రబాబు, పవన్‌, మోదీతోనే సాధ్యమన్నారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్‌ చంద్రశేషు, మండవ లక్ష్మణరావు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పెనుమర్తి రామ్‌కుమార్‌, రాజాన సత్యన్నారాయణ, కరుటూరి రమాదేవి, తెలగారపు జ్యోతి, కొంచాడ ఉమాప్రసాద్‌, నంబూరి రామచంద్రరాజు, గుమ్మడి చిన్నప్రసాద్‌, కరణం రాంబాబు, జనసేన నాయకులు ఉక్కుర్తి సీతారాం, వలవల తాతాజీ పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:39 AM