Share News

జగన్‌ వైరస్‌ను తరమికొట్టేందుకే పోరాటం

ABN , Publish Date - Feb 26 , 2024 | 12:01 AM

రాష్ట్రాన్ని పీడిస్తున్న జగన్‌ వైరస్‌ను తరిమికొట్టేందుకు తెలుగుదేశం, జనసేన కలిసికట్టుగా పోరాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.

జగన్‌ వైరస్‌ను తరమికొట్టేందుకే పోరాటం
జనసేన నాయకులతో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి

మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ

అత్తిలి, ఫిబ్రవరి 25: రాష్ట్రాన్ని పీడిస్తున్న జగన్‌ వైరస్‌ను తరిమికొట్టేందుకు తెలుగుదేశం, జనసేన కలిసికట్టుగా పోరాడుతున్నాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ–జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలంలో సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర ఆదివారం ఆరో రోజుకు చేరింది. శివపురం, తిరుపతిపురం, ఉరదాళ్లపాలెం, రామన్నపేట, గోగులంపేట, పడవలరేవు, చినపేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ శివపురంలో చేనేత కళాకారులు తమ సమస్యల ను వెళ్లబోసుకున్నారు. ఉరదాళ్ల పాలెంలో పెద్ద ఎత్తున టీడీపీలో చేరారు. ఉరదాళ్లపాలెం గ్రామాన్ని మంత్రి కారుమూరి దత్తత గ్రామంగా ప్రకటించారు కానీ ఊరిని అనాథగా వదిలివేశా రని ఆరిమిల్లి దుయ్యబట్టారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు అనాల ఆదినారాయణ, కార్యదర్శి ఆల్తి సత్యనారా యణ, జనసేన నాయకుడు అనుకుల రమేష్‌, టీడీపీ నాయకులు కృష్ణకుమారి, పోతునీడి శ్రీను, పి. హరి, దాసం బాబ్జీ, బొబ్బిలి మోహన్‌, నీతిపూడి శ్రీను, శింగంశెట్టి రవి, ఆల్తి అజయ్‌కుమార్‌, వరి శ్రీను, షేక్‌ మస్తాన్‌, దాసరి నాగరాజు, దాసం చినతాతాజీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 12:01 AM