Share News

టీడీపీ, జనసేన కూటమి విజయం ఖాయం

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:33 PM

రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం ఖాయమని చింతలపూడి నియోజకవర్గ అభ్యర్ధి సొంగా రోషన్‌కుమార్‌ అన్నారు.

టీడీపీ, జనసేన కూటమి విజయం ఖాయం
కలరాయనగూడెంలో టీడీపీ నేతలతో సొంగా రోషన్‌కుమార్‌

జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 29: రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం ఖాయమని చింతలపూడి నియోజకవర్గ అభ్యర్ధి సొంగా రోషన్‌కుమార్‌ అన్నారు. పుట్లగట్లగూడెంలో గురువారం ఆయన జనసేన, టీడీపీ నాయకులను కలుసుకున్నారు. ప్రతి ఒక్కరినీ పరిచయం చేసుకుని కష్టపడి పార్టీ కోసం పని చేయాలని సూచించారు. రోషన్‌కుమార్‌ మాట్లాడు తూ తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా బహిరంగ సభను చూసి వైసీపీకి భయం పట్టుకుందన్నారు. తాడేపల్లిగూడెం సభ విజయవంతం చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రం అభివృద్ది చెందాలంటే చంద్రబాబునాయుడి వలనే సాధ్యమన్నారు.

లింగపాలెం: కలరాయనగూడెంలో కార్యకర్తలతో టీడీపీ మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతిరావు, నందిగం బాబి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో సొంగా రోషన్‌కుమార్‌ సమావేశమయ్యారు. పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలందరూ కృషిచేయాలన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్తో ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగాధర్‌, నందిగం శ్రీధర్‌, వీరయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్మాజీ గూడెం సాయిబాబా ఆలయంలో రోషన్‌ కుమార్‌, టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్న సమారాధన నిర్వహించారు.

కామవరపుకోట: టీడీపీ, జనసేన కూటమికి అపూర్వ ప్రజాదరణ వస్తుందని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ రామకృష్ణ అన్నారు. పాతూ రులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాడేపల్లిగూడెం సభకు అంచనాకు మించి టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారని అన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి విజయం ఖరారైందని, ఎన్నికలు రావటమే తరువాయి అన్నారు. గోరింక దాసు, పసుమర్తి పార్థ సారధిబాబు, గూడపాటి కేశవరావు, జిజ్జూరి బాబ్జీ, రవి, వందనపు మురళీ, బచ్చు వీర వెంకట ముత్యాలరావు తదితరులు ఉన్నారు.

పెదవేగి: తాడేపల్లిగూడెం సభతో తాడేపల్లి ఫ్యాలెస్‌ వణుకుతోందని మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ అన్నారు. టీడీపీ, జనసేన కార్యకర్తల ఉత్సాహాన్ని చూసి కార్యకర ్తనుంచి ముఖ్యమంత్రి వరకు గజగజలాడుతు న్నారన్నారు. దొంగల పార్టీ వైసీపీకి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పోరాడు తున్నాయని, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు కూటమి విజయం తధ్యమని ప్రభాకర్‌ పేర్కొన్నారు.

వైసీపీలో కనీస మర్యాద లేదు

ఏలూరు టూటౌన్‌: వైసీపీలో కార్యకర్తలకు కనీస మర్యాద లేదని, అందుకే టీడీపీలో చేరుతున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి అన్నా రు. వైసీపీ కార్పొరేటర్లు కర్రి శ్రీనివాస్‌, పప్పు ఉమామహేశ్వరరావు, ముగ్గురు మాజీ కార్పొరేటర్లు కౌలూరి చంద్రశేఖర్‌, మాగంటి హేమసుందర్‌, తిలగల ప్రకాశ్‌ టీడీపీలో చేరారు. మరి కొందరు కార్యకర్తలను వెంటబెట్టుకుని విజ యవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం ఏలూరులో చంటి మాట్లాడుతూ జగన్‌ ఒక పెద్ద నియంత అయితే ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని జూనియర్‌ నియంత అన్నారు. రానున్న రోజుల్లో మరికొంతమంది కార్పొరేటర్లు, కార్య కర్తలు టీడీపీలోకి వలస వస్తారన్నారు. నగర అధ్యక్షులు పెద్దిబోయిన శివ ప్రసాద్‌, డిప్యూటీ మాజీ మేయర్‌ చోడే వెంకటరత్నం పాల్గొన్నారు.

Updated Date - Feb 29 , 2024 | 11:33 PM