Share News

ప్రజలు సీఎం సీటునే మారుస్తారు

ABN , Publish Date - Jan 11 , 2024 | 12:15 AM

ఓటమి భయంతో జగన్‌రెడ్డి ఎమ్మెల్యేల స్థానాలను మార్చుతున్నాడని, ప్రజలు సీఎం సీటునే మారుస్తారని మాజీ ఎమ్మెల్యే చిం తమనేని ప్రభాకర్‌ అన్నారు.

ప్రజలు సీఎం సీటునే మారుస్తారు
అంకన్నగూడెంలో చింతమనేని భవిష్యత్‌కు గ్యారెంటీ ప్రచారం

పెదవేగి, జనవరి 10: ఓటమి భయంతో జగన్‌రెడ్డి ఎమ్మెల్యేల స్థానాలను మార్చుతున్నాడని, ప్రజలు సీఎం సీటునే మారుస్తారని మాజీ ఎమ్మెల్యే చిం తమనేని ప్రభాకర్‌ అన్నారు. అంకన్నగూడెం, బి.సింగవరం గ్రామాల్లో బుధ వారం నిర్వహించిన బాబు ష్యూరిటీ – భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి మినీ మేనిఫెస్టో వివరించారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్‌లో ఉన్న రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకొచ్చి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తే, ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చిన జగన్‌రెడ్డి నాలుగున్నరేళ్లలో ఒక్క పరిశ్రమను తీసుకురాలేదు. సరికదా ఉన్న పరిశ్రమలను పారదోలిన అసమర్ధ ముఖ్య మంత్రి అని విమర్శించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటవుతుందని ప్రభాకర్‌ తెలిపారు. బొప్పన సుధాకర్‌, దేవర పల్లి బక్కయ్య, తాతా సత్యనారాయణ, ఆడపా శ్రీను, ప్రసాద్‌, ఆదామ్‌, మామిళ్ళపల్లి సురేష్‌, చందు శ్రీనివాస్‌, భారీఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

దెందులూరు: వైసీపీ పని అయిపోయిందని టీడీపీకే భవిష్యత్‌ ఉందని వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలోకి చేరడమే దీనికి నిదర్శనమని చింతమనేని ప్రభాకరరావు అన్నారు. మండలంలోని మేదినరావుపాలెం శివారు ధర్మారావుపేటలో మాగంటి నారాయణప్రసాద్‌, మోతుకూరి నానిబాబు ఆధ్వర్యంలో భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపీణీ చేశారు. టీడీపీ నేతలు గారపాటి రంగయ్య, కొమ్మన ప్రసాద్‌, గారపాటి గోపి, మురళి, గుడపాటి భీష్మ, టీడీపీ నేతలు ఉన్నారు.

ఏలూరు టూటౌన్‌: రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బడేటి చంటి అన్నారు. 28వ డివిజన్‌లో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకు న్నారు. జగన్‌ అరాచక పాలనపై ప్రజలకు విరక్తి కలిగిందన్నారు. జనసేన, టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే అమలు చేసే సూపర్‌ 6 పథకాలు వివరించారు. కార్యక్రమంలో రెడ్డి నాగరాజు, తంగిరాల అరుణసురేష్‌, కృష్ణవేణి, మనోహర్‌, చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

కామవరపుకోట: టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు వజీర్‌ఖాన్‌ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్‌ గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సూపర్‌–6 పథకాల బ్రోచర్లను అందజేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ–జనసేన కూటమికి ఓట్లువేయాలని అభ్యర్ధించారు. కార్యక్రమంలో బూత్‌ కన్వీనర్‌ మల్లెల్లి పృధ్విరాజ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2024 | 12:15 AM