బీసీల వెన్ను విరిచిన జగన్
ABN , Publish Date - Jan 11 , 2024 | 12:12 AM
నిధులు, విధులు లేని కార్పొరేషన్లతో సీఎం జగన్ బీసీల వెన్ను విరిచారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అ న్నారు.
![బీసీల వెన్ను విరిచిన జగన్](https://media.andhrajyothy.com/media/2023/20231205/10bmdl02_e040db566d.jpg)
టీడీపీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం
భీమడోలు, జనవరి 10: నిధులు, విధులు లేని కార్పొరేషన్లతో సీఎం జగన్ బీసీల వెన్ను విరిచారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు అ న్నారు. గుండుగొలనులో బుధవారం జయహో బీసీ కార్యక్రమంలో ఆయన తోపాటు గోరుముచ్చు గోపాల్ యాదవ్ మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీ కార్పొరేషన్లు కొనసాగించి వారి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో శివబత్తిన వీర వెంకట సత్యనారాయణ, పట్నాల వెంకటేశ్ బాబు, పెద్దిరాజు, బీసీ నాయకులు పాల్గొన్నారు.
కామవరపుకోట: రాష్ట్రంలో వైసీపీ అరాచకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరికీ బీసీలంతా వివరించాలని మాజీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. ఆడమిల్లిలో బుధవారం జరిగిన జయహో బీసీ కార్యక్రమా నికి టీడీపీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు జిజ్జూరి బాబ్జీ అధ్యక్షత వహించారు. మాగంటి బాబు మాట్లాడుతూ నాయకులు, కార్యకర్తలు టీడీపీ విజయానికి కృషి చేయాలన్నారు. బీసీ సాధికార సమితి రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వరరావు మాట్లాడుతూ జగన్ బీసీలకు తీరని అన్యాయం చేశారన్నారు. బీసీ సాధికార సమితి డైరెక్టర్లు చిట్రోజు తాతాజీ, బేణు ప్రసాద్ మాట్లాడారు. గోరుముచ్చు గోపాల్యాదవ్, కోళ్ళ నాగేశ్వర రావు, జగ్గవరపు ముత్తారెడ్డి, కిలారు సత్యనారాయణ, సాయల సత్యనారా యణ, గూడపాటి కేశవరావు, చెరువుగట్టు రామ్మోహన్రావు, వేముల నాగేశ్వరరావు, తూటికుంట రాము, దుర్గారావు, తదితరులు పాల్గొన్నారు.