పేదల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం
ABN , Publish Date - Apr 14 , 2024 | 12:21 AM
పేదల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని చింతమనేని వెంకట రాధారాణి అన్నారు.
![పేదల సంక్షేమం టీడీపీతోనే సాధ్యం](https://media.andhrajyothy.com/media/2024/20240413/13pedavegi3_1db6126ae7.gif)
బాపిరాజుగూడెంలో చింతమనేని వెంకట రాధారాణి ప్రచారం
పెదవేగి, ఏప్రిల్ 13 : పేదల సంక్షేమం టీడీపీతోనే సాధ్యమని చింతమనేని వెంకట రాధారాణి అన్నారు. శనివారం బాపిరాజుగూడెంలో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతీమణి వెంకట రాధారాణి ‘బాబు ష్యూరిటీ– భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. ప్రజల నమ్మకాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ అధికారంలోకి వచ్చిందని, ఆనాటి నుంచి రాష్ట్రంలో ప్రజలు ఇక్కట్ల పాలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ చేస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రశ్నించే వారిపై దాడులు, దౌర్జన్యాలు చేస్తూ, ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బొప్పన సుధాకర్, గ్రామ సర్పంచ్ జోగి పెదపెంటయ్య, ఎంపీటీసీ సభ్యు డు మద్దాల సహదేవుడు, పార్టీ నాయకులు తలకొండ జమలయ్య, బొప్పన మార్కం డేయులు, మంచినేని శ్రీనివాసరావు, జోగి సత్యవతి, పులిచర్ల రాధిక, తాళం సూర్యా వతి, వెలివెల వాణి, అత్తిలి సోమేశ్వరమ్మ, చలమాల సత్యవతి తదితరులు పాల్గొన్నారు.