తపనా చౌదరి కంటికి స్ర్టోక్
ABN , Publish Date - Jan 05 , 2024 | 12:10 AM
బీజేపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయచౌదరి (తపనా చౌదరి) అస్వస్థతకు గురైనట్టు బీజేపీ నేతలు తెలిపారు.
![తపనా చౌదరి కంటికి స్ర్టోక్](https://media.andhrajyothy.com/media/2023/20231205/4_Eluru_Sagar_3_4a40d664f5.jpg)
ఏలూరు టూ టౌన్, జన వరి 4 : బీజేపీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయచౌదరి (తపనా చౌదరి) అస్వస్థతకు గురైనట్టు బీజేపీ నేతలు తెలిపారు. మెదడు నుంచి కంటికి వెళ్లే నాళంలో బ్లాక్ (గడ్డ) ఏర్పడడంతో కుడి కంటికి స్ర్టోక్ వచ్చింది. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నుంచి అక్కడే వున్న కిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. పదిహేనేళ్లుగా సేవా రంగంలో ఉండడంతో ప్రజల ఆశీస్సులతో క్షేమం గానే ఉన్నానని, ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని చౌదరి ఓ ప్రకటనలో తెలిపారు.