Share News

వడదెబ్బతో ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:42 AM

మండలం సీతారామనగరంలో ఇద్దరు వృద్ధులు వడదెబ్బకు గురై మృతి చెందారు.

వడదెబ్బతో ఇద్దరి మృతి

కుక్కునూరు, జూన్‌ 1 : మండలం సీతారామనగరంలో ఇద్దరు వృద్ధులు వడదెబ్బకు గురై మృతి చెందారు. శుక్రవారం గ్రామానికి చెందిన ఏలూరి ముక్తేశ్వరరావు (63) తాను సాగు చేస్తున్న ఆకుకూరల తోట వద్దకు వెళ్ళి వడ దెబ్బకు గురికాగా, గ్రామానికి చెందిన వృద్ధురాలు షేక్‌ మహబూబి (70) ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బ బారిన పడింది. తీవ్ర అస్వస్థతకు గురైన వీరిని భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి పొద్దుపోయిన తర్వాత మృతి చెందారు. శనివారం గ్రామానికి మృతదేహాలను తీసుకొచ్చారు.

Updated Date - Jun 02 , 2024 | 12:43 AM