Share News

మొరాయించిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - May 26 , 2024 | 11:45 PM

జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మొరాయించిన ఆర్టీసీ బస్సు
మర్లగూడెం సమీపంలో నిలిచిన ఆర్టీసీ బస్సు

మర్లగూడెం సమీపంలో నిలిచిన వైనం

పల్లెలకు కండీషన్‌లేని బస్సులు నడుపుతున్నారంటూ ఆగ్రహం

బుట్టాయగూడెం, మే 26 : జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులు ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నాయంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఎక్కిన తర్వాత ఇంటికి చేరతామనే నమ్మకం లేదని వాపోతున్నారు. జంగారెడ్డిగూడెం– దొరమామిడి గ్రామాల మధ్య తిరిగే జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బుట్టాయగూడెం మండలం మర్లగూడెం సమీపంలోని జైహింద్‌ కాల్వ వద్ద ఆదివారం నిలిచిపో యింది. బస్సులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్గమధ్యలో నిలిచిపోవడంతో ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదర్కొన్నారు. వారం రోజుల వ్యవధిలోనే జంగారెడ్డిగూడెం డిపోకు చెందిన బస్సులు తరచూ పాడైపోతూ పలుచోట్ల మార్గమధ్యలో నిలిచిపోయాయి. పల్లెల్లో కండీషన్‌లోలేని బస్సులను తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 26 , 2024 | 11:48 PM