ఊక ట్రక్కు బోల్తా.. యువకుడి దుర్మరణం
ABN , Publish Date - Jan 14 , 2024 | 01:11 AM
పెరికేగూడెం వద్ద ప్రమాదవశాత్తు ఊక ట్రక్కు బోల్తా పడడంతో గుడివాడ నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి చెందిన గడ్డం దానియేలు కుమారుడు అనిల్కుమార్ (17) మృతి చెందాడు.
![ఊక ట్రక్కు బోల్తా.. యువకుడి దుర్మరణం](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
మండవల్లి, జనవరి 13: పెరికేగూడెం వద్ద ప్రమాదవశాత్తు ఊక ట్రక్కు బోల్తా పడడంతో గుడివాడ నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి చెందిన గడ్డం దానియేలు కుమారుడు అనిల్కుమార్ (17) మృతి చెందాడు. శనివారం తెల్లవారజామున గ్రామస్థులతో కలసి ట్రాక్టర్లో ఊక లోడ్ చేసుకొని వెళ్తుండగా పెరికేగూడెం వద్ద ట్రాక్టర్ బోల్తా పడటంతో అతను ఊకలో చిక్కుకుపోయాడు. స్థానికులు అతనిని బయటకు తీసి, కైకలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు మండవల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.