Share News

ప్రజాధనం వృథా..

ABN , Publish Date - May 22 , 2024 | 12:01 AM

అత్తిలి మేజర్‌ గ్రామ పంచాయ తీలో చెత్తను తరలించే చెత్త రిక్షాలు మూలపడి తుప్పుపడుతున్నాయి.

ప్రజాధనం వృథా..
మూలకు చేరిన చెత్త రిక్షాలు

తుప్పుపట్టి మూలకు చేరిన చెత్త రిక్షాలు

అత్తిలి, మే 21: అత్తిలి మేజర్‌ గ్రామ పంచాయ తీలో చెత్తను తరలించే చెత్త రిక్షాలు మూలపడి తుప్పుపడుతున్నాయి. మూడేళ్ల క్రితం ప్రభుత్వం వార్డులలో చెత్తను సేకరించి సంపద కేంద్రాలకు తరలించేందుకు వీటిని పంచాయతీ కార్మికులకు అందజేసింది. అయితే వాటిని వినియోగించుకోకు ండా మూల పడేసినా అధికారులు చూసీ చూడన ట్లు వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లక్షల విలువ చేసే చెత్త రిక్షాలు ఇలా తుప్పుపడుతుంటే పంచాయతీ అధికారులు, పాలకులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా వాటిని వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.

Updated Date - May 22 , 2024 | 12:01 AM