Share News

అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీ లభ్యం

ABN , Publish Date - Apr 30 , 2024 | 01:21 AM

భర్త వేధింపుల కారణంగా 3 రోజుల క్రితం అదృశ్యమైన బర్రె ఆమని, ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు విజయవాడ బస్‌స్టేషన్‌లో కనుగొని సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు.

 అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీ లభ్యం

చాట్రాయి, ఏప్రిల్‌ 29: భర్త వేధింపుల కారణంగా 3 రోజుల క్రితం అదృశ్యమైన బర్రె ఆమని, ఆమె ఇద్దరు పిల్లలను పోలీసులు విజయవాడ బస్‌స్టేషన్‌లో కనుగొని సోమవారం తల్లిదండ్రులకు అప్పగించారు. చనుబండ గ్రామానికి చెందిన బర్రె విజయకాంత్‌, ఆమని భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్యాభర్తల మధ్య గొడవ జరగటంతో ఈ నెల 25న భర్తపై ఫిర్యాదు చేయటానికి ఆమని పిల్లలను తీసుకొని చాట్రాయి పోలీస్టేషన్‌కు వెళ్లగా ఎన్నికల బందోబస్తు కారణంగా స్టేషన్‌లో ఎవరూ లేకపోవటంతో ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోయి తరువాత అదృశ్యమైన విషయం విదితమే. ఆమనిని, పిల్లలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించామని, భర్త బర్రె విజయకాంత్‌పై కట్నం వేధింపుల కేసు నమోదు చేశామని ఎస్సై కేసీహెచ్‌ స్వామి, ఏఎస్‌ఐ గజపతిరావు తెలిపారు.

Updated Date - Apr 30 , 2024 | 01:21 AM