Share News

‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ లక్కీ డ్రా విజేతలు

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:07 AM

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాస్థాయి ఫలితాలపై ‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ లక్కీ డ్రా కూపన్‌ పోటీకి అనూహ్య స్పందన లభించింది.

‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ లక్కీ డ్రా విజేతలు

తణుకు, జూన్‌ 5 : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాస్థాయి ఫలితాలపై ‘ఎవరు గెలిచినా మీదే గెలుపు’ లక్కీ డ్రా కూపన్‌ పోటీకి అనూహ్య స్పందన లభించింది. పాఠకులు ఆయా పార్టీలు గెలుపొందే స్థానాలను ముందస్తుగా అంచనా వేసి కూపన్లను పూరించి భారీసంఖ్యలో పంపించారు. వారిలో విజేతలను బుధవారం తాడేపల్లిగూడెం యూనిట్‌ కార్యాలయంలో బ్రాంచి మేనేజర్‌ హరిబాబు ఆధ్వర్యంలో డ్రా తీశారు. మొదటి బహుమతి విజేతకు రూ.10,000, మరో మూడు ద్వితీయ బహుమతులుగా రూ.5,000 చొప్పున గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో యూనిట్‌ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

విజేతలు వీరే..

1. గుడియాకుల శ్రీనివాసరావు, తడికలపూడి, మొదటి బహుమతి రూ.10,000

2. మద్దిపాటి సుబ్బారావు, చోడవరం, ద్వితీయ బహుమతి రూ.5,000

3. సీహెచ్‌ అలివేణి, ఏలూరు, ద్వితీయ బహుమతి రూ.5,000

4. చిటికెల అప్పారావు, జంగారెడ్డిగూడెం, ద్వితీయ బహుమతి రూ.5,000

Updated Date - Jun 06 , 2024 | 12:07 AM