Share News

పందేల బరుల ధ్వంసం

ABN , Publish Date - Jan 12 , 2024 | 12:08 AM

కోడిపందేల బరుల ను ధ్వంసం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పందేల నిర్వహ ణకు చదును చేసిన పొలాలను ట్రాక్టర్లతో తిరిగి దున్నించారు.

పందేల బరుల ధ్వంసం
అల్లూరులో పందేల బరికి చదును చేసిన పొలాన్ని ట్రాక్టర్లతో ధ్వంసం చేయిస్తున్న పోలీసులు

ముదినేపల్లి, జనవరి 11 : కోడిపందేల బరుల ను ధ్వంసం చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పందేల నిర్వహ ణకు చదును చేసిన పొలాలను ట్రాక్టర్లతో తిరిగి దున్నించారు. ‘కోఢీ’ అనే శీర్షికన కైకలూరు నియోజకవర్గంలో పందేలకు బరులు సిద్ధం చేస్తున్నట్టు గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనంపై స్పందించిన కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి పందేల నిర్వహణ ఏర్పాట్లను తక్షణం అడ్డుకోవా లని ఆదేశాలు జారీ చేశారు. తహసీల్దార్‌ శ్రీనివాస్‌, కైకలూరు రూరల్‌ సీఐ కృష్ణ కుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ డి.వెంకట్‌ కుమార్‌, పోలీసు సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అల్లూరులో పందేల బరికి చదును చేసిన పొలాన్ని ట్రాక్టర్లతో దున్నిం చేశారు. మండలంలోని మరికొందరికి నోటీసులు జారీ చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 12:08 AM