Share News

ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీవోగా జేసీ ధాత్రిరెడ్డి బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Aug 20 , 2024 | 12:37 AM

కేఆర్‌ పురం ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీవోగా జేసీ పి.ధాత్రిరెడ్డి సోమవారం ఏలూరులో బాధ్యతలు స్వీకరించారు.

 ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీవోగా జేసీ ధాత్రిరెడ్డి బాధ్యతల స్వీకరణ

బుట్టాయగూడెం, ఆగస్టు 19 : కేఆర్‌ పురం ఐటీడీఏ ఇన్‌చార్జ్‌ పీవోగా జేసీ పి.ధాత్రిరెడ్డి సోమవారం ఏలూరులో బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన పీవో ఎం.సూర్యతేజ కర్నూల్‌ జిల్లా మునిసిపల్‌ కమిషనర్‌గా బదిలీ కావడంతో ఇన్‌చార్జి పీవోగా ఎస్డీసీ జి.శ్రీనుకుమార్‌ను నియమించారు. అనంతరం ఐటీడీఏ పీవోగా ఓ మహిళా ఐఏఎస్‌ను నియమించినా ఆమె విధుల్లో చేరకపోవడంతో శ్రీనుకుమార్‌ ఇన్‌చార్జి పీవోగా కొన సాగుతున్నారు. ఇటీవల జేసీ ధాత్రిరెడ్డికి పీవోగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆమె బాధ్యతలు స్వీకరించారు.

Updated Date - Aug 20 , 2024 | 12:37 AM