భానుడి భగభగ
ABN , Publish Date - May 23 , 2024 | 11:33 PM
సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజానీకం విలవిలలాడుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు.
![భానుడి భగభగ](https://media.andhrajyothy.com/media/2024/20240511/23_ACHANTA_4_d486572fc7.jpg)
ఆకివీడు/ఆచంట, మే 23: సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఎండ తీవ్రతకు ప్రజానీకం విలవిలలాడుతున్నారు. బయటకు రావాలంటే భయపడుతున్నారు. ప్రధాన రహదారిలో వాహనాల రాకపోకలు తగ్గాయి. ఉదయం పది గంటల తరువాత ప్రజలు, పదకొండు దాటినాక వాహనదారులు అంతగా రోడ్లపై కనిపించకపోవడంతో రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. వాతావరణంలో తేమశాతం తగ్గిపోవడం, వేడి విపరీతంగా పెరిగిపోవడం వలన ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం రద్దీగా ఉండే మెయిన్ సెంటర్లలో గురువారం ఎండ తీవ్రతకు రోడ్లపై ఎవరూ కనిపించడంలేదు. బేరాలు లేక పోవడంతో వ్యాపారస్థులు మధ్యాహ్నం సమయంలో దుకాణాలు మూసేస్తున్నారు. ఎండ నుంచి విముక్తి పొందడానికి ప్రజలు పండ్లు, పండ్లరసాలు, కూల్ డ్రింక్స్ సేవించి ఉపశమనం పొందుతున్నారు.