Share News

160 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - May 24 , 2024 | 12:03 AM

ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతికి అందిన సమాచారంతో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేటు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.

160 కేజీల గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్టు
స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న ఏఎస్పీ సూర్యచంద్రరావు

ఏలూరు క్రైం, మే 23: ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతికి అందిన సమాచారంతో ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్‌గేటు వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ కారును తనిఖీలు చేయగా అందులో ఎనిమిది గోనె సంచులలో ఒక్కొక్క సంచిలో పది ప్యాకెట్లు గంజాయి ఉండడాన్ని గుర్తించారు. మొత్తం 160 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 10 లక్షల 55 వేలు ఉంటుందని గుర్తించారు. వాహనంలో ఉన్న నిందితులైన మహారాష్ట్రకు చెందిన బరమతి గ్రామానికి చెందిన జామీర్‌ పింజరి, మహారాష్ట్రలోని థానీ జిల్లాకు బివన్‌ గ్రామానికి చెందిన అంతిక్యూ అహ్మద్‌ను అరెస్టు చేశారు. వారి నుంచి సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దాడుల్లో ఏలూరు ఎస్‌ఈబీ స్టేషన్‌ సీఐ కె. విద్యాసుధాకర్‌, ఎస్‌ఐ పి.శివప్రసాద్‌, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు, పాల్గొన్నారు. వీరిని అదనపు ఎస్పీ ఎన్‌.సూర్యచంద్రరావు అభినందించారు.

Updated Date - May 24 , 2024 | 12:03 AM