Share News

బస్సులో బంగారు ఆభరణాల బ్యాగ్‌

ABN , Publish Date - Aug 21 , 2024 | 12:14 AM

హైద్రాబాదు బీహెచ్‌ ఈఎల్‌ నుంచి తణుకు వచ్చిన నైట్‌ రైడర్‌ బస్సులో పేర్ల ప్రదీప్‌ అనే ప్రయాణికుడు ఆరు లక్షల విలువైన బంగారు ఆభర ణాలు ఉన్న బ్యాగ్‌ మర్చిపోయి విజయవాడలో దిగిపోయాడు.

బస్సులో బంగారు ఆభరణాల బ్యాగ్‌
బ్యాగ్‌ను డీఎంకు అందజేసిన డ్రైవర్లు

డిపో మేనేజర్‌కు అప్పగించిన డ్రైవరు.. ప్రయాణికుడికి అందజేత

తణుకు, ఆగస్టు 20 : హైద్రాబాదు బీహెచ్‌ ఈఎల్‌ నుంచి తణుకు వచ్చిన నైట్‌ రైడర్‌ బస్సులో పేర్ల ప్రదీప్‌ అనే ప్రయాణికుడు ఆరు లక్షల విలువైన బంగారు ఆభర ణాలు ఉన్న బ్యాగ్‌ మర్చిపోయి విజయవాడలో దిగిపోయాడు. ఈ సంఘటన మంగళవారం జరిగింది. తణుకు వచ్చిన తర్వాత బస్సులో బ్యాగును గమనించిన డ్రైవర్లు యన్నం వెంకట గోపాలరావు, పెనుమత్స శ్రీనివాసరాజులు ఆ బ్యాగును తణుకు డిపో మేనేజర్‌ గిరిధర్‌కు అప్పగించారు. ప్రదీప్‌కు సమాచరం ఇవ్వడంతో తణుకు వచ్చి ఆ బ్యాగ్‌ తీసుకున్నాడు. డ్రైవర్లు నిజాయితీగా వ్యవహరించి సంస్థకు మంచి పేరు తీసుకువచ్చారని డీఎం అభినందించారు.

Updated Date - Aug 21 , 2024 | 12:14 AM