Share News

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Apr 12 , 2024 | 12:09 AM

ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగిం చుకోవాలనే గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నా మని సీఐ రామకృష్ణ తెలిపారు.

స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
అవగాహన కార్యక్రమంలో సీఐ రామకృష్ణ

ఆగిరిపల్లి, ఏప్రిల్‌ 11: ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగిం చుకోవాలనే గ్రామాల్లో సాయుధ బలగాలతో కవాతు నిర్వహిస్తున్నా మని సీఐ రామకృష్ణ తెలిపారు. నెక్కలంగొల్ల గూడెం గ్రామంలో నూజివీడు సీఐ రామకృష్ణ, ఆగిరిపల్లి ఎస్‌ఐ సురేంద్రబాబు ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సాయుధ బలగాల కవాతు నిర్వహించారు. అనంతరం కనసానపల్లి గ్రామంలో ఓటర్లకు అవగాహన సదస్సు నిర్వహించి, ప్రజలకు ఓటు విలువను వివరించారు. బిడ్డల భవిష్యత్‌ కోసం ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోవాలని సీఐ సూచించారు.

Updated Date - Apr 12 , 2024 | 12:09 AM