Share News

నీళ్లులేక మృత్యువాత

ABN , Publish Date - Apr 19 , 2024 | 01:05 AM

పాలకుల అలసత్వమో.. అధికా రుల నిర్లక్ష్యమో.. తెలీదు గానీ లక్షలు విలువ చేసే చేపలు మృతి చెందాయి.

 నీళ్లులేక మృత్యువాత
చెరువులో తేలియాడుతున్న చనిపోయిన చేపలు

తక్కెళ్లపాడు మంచినీటి చెరువులో చేపలు మృతి

మండవల్లి, ఏప్రిల్‌ 18 : పాలకుల అలసత్వమో.. అధికా రుల నిర్లక్ష్యమో.. తెలీదు గానీ లక్షలు విలువ చేసే చేపలు మృతి చెందాయి. తక్కెళ్లపాడు గ్రామంలోని మంచినీటి చెరువులో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కొల్లేటిలంక గ్రామాలకు మంచినీరు సరఫరా చేసే తక్కెళ్ళ పాడు రక్షిత మంచినీటి పథకం చెరువులో నీటిమట్టం తగ్గిపోగా రెండు రోజులుగా మండుటెండలకు చెరువులో చేపలు తట్టుకోలేక ఆకస్మాత్తుగా మృతిచెందాయి. చెరువు లోని చేపలు పట్టుబడికి వచ్చాకా వేలం నిర్వహిస్తారు. చెరువులో చేపలు ఉన్నప్పుడు నీరు తగ్గుతున్న పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే సుమారు రూ.నాలు గు లక్షల నుంచి రూ.ఐదు లక్షల విలువైన చేపలు మృతి చెందినట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చేపలు చని పోవడం వల్ల చెరువులోని నీరు కలుషితమైందని తాగడం మాట ఎలా ఉన్నా.. వినియోగించుకోవడానికి కూడా పనికి రావడం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో చని పోయిన చేపలను తొలగించాలని కోరుతున్నారు.

Updated Date - Apr 19 , 2024 | 01:05 AM