ఎన్నికల తనిఖీలు.. రూ.2.50 లక్షలు సీజ్
ABN , Publish Date - Mar 28 , 2024 | 12:36 AM
ఎన్నికల నేపథ్యంలో కొత్తూరు ఆర్అండ్బీ బంగ్లా సమీపంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద బుధవారం అధి కారులు వాహనాల తనిఖీ నిర్వహించారు.
కామవరపుకోట/ నిడమర్రు మార్చి 27 : ఎన్నికల నేపథ్యంలో కొత్తూరు ఆర్అండ్బీ బంగ్లా సమీపంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద బుధవారం అధి కారులు వాహనాల తనిఖీ నిర్వహించారు. ఒక వాహనంలో 75 వేల రూపా యల నగదు తీసుకువెళ్తుండగా వాటిని మండల తహసీల్దార్ రమేష్ సీజ్ చేసి మండల పరిషత్ ఏవో సత్యవాణికి అందజేశారు.తడికలపూడి ఎస్ఐ జయ బాబు, ఎన్నికల అధికారులు మొహిద్దీన్, శేషగిరి, తదితరులు ఉన్నారు. నిడమర్రు పోలిస్స్టేషన్ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా ఒక కారులో లక్షా 75 వేల రూపాయలు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తీసు కు వెళుతుండగా సీజ్ చేసినట్టు నిడమర్రు ఎస్ఐ ఆర్.శ్రీను తెలిపారు. తనిఖీల్లో జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ భాషా, టీం సభ్యులు మనోహర్, దుర్గారావు, రవికుమార్, మోహనరావు తదితరులు పాల్గొన్నారు.