Share News

ముగ్గురు డీఎస్పీల బదిలీ

ABN , Publish Date - Feb 02 , 2024 | 12:38 AM

జిల్లాలో నూజివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీలను బదిలీ చేశారు. నూతనంగా డీఎస్పీలను నియమించారు.

ముగ్గురు డీఎస్పీల బదిలీ

ఏలూరు క్రైం, ఫిబ్రవరి 1 : జిల్లాలో నూజివీడు, జంగారెడ్డిగూడెం, పోలవరం, ఇంటెలిజెన్స్‌ డీఎస్పీలను బదిలీ చేశారు. నూతనంగా డీఎస్పీలను నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 మంది డీఎస్పీలను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు బదిలీ చేశారు. నూజివీడు డీఎస్పీ ఇ.అశోక్‌కుమార్‌ గౌడ్‌ను ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ –2 డీఎస్పీగా నియమించగా ఆయన స్థానంలో మెరైన్‌ డీఎస్పీ అటాచ్డ్‌ టు విశాఖపట్నం కమిషనరేట్‌ ఆఫ్‌ పోలీస్‌లో ఉన్న డీఎస్పీ ఎం.శ్రీనివాసరావును నూజివీడు డీఎస్పీగా నియమించారు. పోలవరం డీఎస్పీ జి.రత్నరాజును ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనరేట్‌ సౌత్‌ ఏసీపీగా నియమించగా పశ్చిమ గోదావరి జిల్లా సీసీఎస్‌ డీఎస్పీ జీవీఎస్‌ పైడేశ్వరరావును పోలవరం డీఎస్పీగా నియమించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయు డును ఈవోడబ్ల్యు–2 డీఎస్పీగా నియమించగా పల్నాడు జిల్లా దిశ డీఎస్పీ యు.రవిచంద్రను జంగారెడ్డిగూడెం డీఎస్పీగా నియమించారు. 14వ బెటాలియన్‌ డీఎస్పీ అటాచ్డ్‌టు ఎస్సీ ఎస్టీ సెల్‌ నంద్యాల డీఎస్పీగా పనిచేస్తున్న ఆర్‌.రామాంజి నాయక్‌ను ఏపీఎస్పీ మూడో బెటాలియన్‌ డీఎస్పీగా నియమించి ఏలూరు ఎస్సీ ఎస్టీ సెల్‌ అటాచ్డ్‌ డీఎస్పీగా పోస్టింగ్‌ ఇచ్చారు. నందిగామ డీఎస్పీ అటాచ్డ్‌టు పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్న డీఎస్పీ కె.జనార్దన్‌నాయుడును ఏలూరు జిల్లా ఎస్‌ఈబీ డీఎస్పీగా నియమించారు. జిల్లా ఇంటెలిజెన్స్‌ డీఎస్పీగా పనిచేస్తున్న ఎం.వెంకటేశ్వరరావును తుళ్ళూరు డీఎస్పీగా నియమించారు.

Updated Date - Feb 02 , 2024 | 12:38 AM