Share News

రాజీనామా చేయండి

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:01 AM

వలంటీర్‌ వ్యవస్ధతోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్న వైసీపీ ప్రభుత్వం ఆలోచన బెడిసికొట్టడంతో వలంటీర్లను పూర్తిస్ధాయిలో ఎన్నికల నిర్వహణలో వినియోగించుకోవాలన్న ఎత్తుగడలో అధికార పార్టీ నేతలు ఉన్నారు.

 రాజీనామా చేయండి
సోమనాద్రిపురం అగ్రహారంలో వలంటీర్లతో వైసీపీ నేతల సమావేశం

సోమనాద్రిపురంలో రహస్య సమావేశం

మండవల్లి, ఏప్రిల్‌ 19: వలంటీర్‌ వ్యవస్ధతోనే ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్న వైసీపీ ప్రభుత్వం ఆలోచన బెడిసికొట్టడంతో వలంటీర్లను పూర్తిస్ధాయిలో ఎన్నికల నిర్వహణలో వినియోగించుకోవాలన్న ఎత్తుగడలో అధికార పార్టీ నేతలు ఉన్నారు. వలంటీర్లు ఎన్నికల నిర్వహణ విధుల్లో పాల్గొనరాదని కోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నప్పటికి వారిని వినియోగించుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైసీపీ నేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. మండవల్లి మండలంలో వలంటీర్ల సమా వేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం రహస్యంగా నిర్వహించారు. ఇప్పటికే కొంతమంది వలంటీర్లతో వైసీపీ నాయకులు బలవం తంగా రాజీనామాలు చేయించినప్పటికీ మిగి లిన వారు కూడా రాజీనామా చేసి ఎన్నికల్లో వైసీపీ విజయానికి దోహదపడాలని కొందరు నేతలు ఒత్తిడి చేయడం చర్చనీయంశమైంది. రానున్నది వైసీపీ ప్రభుత్వమ ని, ప్రత్యేక నోటీఫికేషన్‌తో రాజీనామా చేసిన వలంటీర్లు అందర్నీ విధుల్లోకి తీసుకుం టామంటూ హామీ ఇస్తున్నట్లు తెలిసింది. రాజీనామా చేసిన వలంటీర్లకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసే యోచన ఉన్నట్లు చెబుతున్నారు. వినకపోతే భయపెట్టి రాజీనామా చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇదంతా సమావేశ హాల్‌లో ఒక యువకుడు వీడియో తీస్తుండగా వైసీపీ సర్పంచ్‌ దాడి చేసినట్లు తెలిసింది.

Updated Date - Apr 20 , 2024 | 01:02 AM