Share News

అట్టహాసంగా పత్సమట్ల ధర్మరాజు నామినేషన్‌

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:26 AM

ఉంగుటూరు నియోజవకర్గ కూటమి జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది.

అట్టహాసంగా పత్సమట్ల ధర్మరాజు నామినేషన్‌
నామినేషన్‌కు తరలివెళుతున్న కూటమి అభ్యర్థి ధర్మరాజు, చిత్రంలో గన్ని

మోటారు సైకిళ్ళ ర్యాలీతో హైవే పసుపుమయం

ఉంగుటూరు, ఏప్రిల్‌ 23 : ఉంగుటూరు నియోజవకర్గ కూటమి జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణుల మోటారు సైకిళ్ళ ర్యాలీ, ఆటోలు, కార్ల ర్యాలీతో జాతీయరహదారి పసుపుమయం అయింది. భీమడోలు నిడమర్రు, ఉంగుటూరు, గణపవరం మండలాల నుంచి కూటమి పార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉంగుటూరు తరలి రావడంతో పండుగ వాతావరణం వచ్చింది. కూటమి అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు స్వగ్రామమైన నిడమర్రు మండలం ఫత్తేపురం గ్రామదేవత చిట్టాలమ్మ అమ్మవారిని దర్శించుకుని అక్కడి నుంచి ఉంగుటూరు మండలం నారాయణపురం మురుక్కోడు వంతెన వద్ద నుంచి నిడమర్రు, గణపవరం మండలాల కార్యకర్తలతో కలసి ర్యాలీగా బయలు దేరి ఉంగుటూరు తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. కార్యక్రమంలో ఏలూరు జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, మాజీ జడ్పీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు, బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్‌ శరణాల మాలతీరాణి, నియోజకవర్గ జనసేన నిర్వహణ సమన్వయకర్త వట్టి పవన్‌ కుమార్‌ల ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు.

Updated Date - Apr 24 , 2024 | 12:26 AM