Share News

నేటి నుంచి చైతన్య భారతి జాతీయ స్థాయి నాటిక పోటీలు

ABN , Publish Date - May 29 , 2024 | 11:41 PM

భీమవరం డీఎన్‌ఆర్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్లో నేటి నుంచి జరగనున్న చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీల ఏర్పాట్లు పూర్తయ్యాయని చైతన్య భారతి నృత్య నాటక పరిషత్‌ అధ్యక్షుడే రాయప్రోలు భగవాన్‌ తెలిపారు.

నేటి నుంచి చైతన్య భారతి జాతీయ స్థాయి నాటిక పోటీలు
చైతన్య భారతి నాటక పోటీలకు సిద్ధం అవుతున్న కళావేదిక

భీమవరం అర్బన్‌, మే 29: భీమవరం డీఎన్‌ఆర్‌ ఇంగ్లీష్‌ మీడియం హైస్కూల్లో నేటి నుంచి జరగనున్న చైతన్య భారతి 17వ జాతీయ స్థాయి నాటిక పోటీల ఏర్పాట్లు పూర్తయ్యాయని చైతన్య భారతి నృత్య నాటక పరిషత్‌ అధ్యక్షుడే రాయప్రోలు భగవాన్‌ తెలిపారు. గురువారం జరిగే నాటక పోటీల్లో సినీ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణకు ఆత్మీయ చైతన్య పురస్కారం, రంగస్ధల నటుడు, నాటక రచయిత డాక్టర్‌ పూరాణం వెంకట రామ్‌కుమార్‌కు జవ్వాది రంగస్థల పురస్కారం, రంగస్థల నటుడు దర్శకుడు జనాభ్‌ భాషాకు మైనంపాటి రంగనాయకులు రరగస్థల చైతన్య పురస్కారాలతో సత్కరిస్తారన్నారు. అనంతరం గోవాడ క్రియేషన్స్‌ హైదరాబాదు వారి మూల్యం నాటక ప్రదర్శన జరుగుతుందని తెలిపారు. వేదిక ఏర్పాట్లను నిర్వహకులు రాయప్రోలు శ్రీనివాసముర్తి, భట్టిప్రోలు శ్రీనివాసరావు, పేరిచర్ల లక్ష్మణవర్మ, కట్రెడ్డి సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.

Updated Date - May 29 , 2024 | 11:41 PM