కలెక్టర్ కృషి స్ఫూర్తిదాయకం : జేసీ
ABN , Publish Date - Jun 09 , 2024 | 12:21 AM
జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వ హణకు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ చేసిన కృషికి అందరికి స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, రిటర్నింగ్ అధికారులు, ఐటీడీఏ పీవో సూర్యతేజ, ఆర్డీవో ఖాజావలీ తదితర రిటర్నింగ్ అధికారులు అన్నారు.
![కలెక్టర్ కృషి స్ఫూర్తిదాయకం : జేసీ](https://media.andhrajyothy.com/media/2024/20240604/8sridharrural_4_3253ba3396.jpg)
ఏలూరు కలెక్టరేట్, జూన్ 8 : జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వ హణకు కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ చేసిన కృషికి అందరికి స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, రిటర్నింగ్ అధికారులు, ఐటీడీఏ పీవో సూర్యతేజ, ఆర్డీవో ఖాజావలీ తదితర రిటర్నింగ్ అధికారులు అన్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసిన సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కలెక్టర్ క్యాంప్ కార్యా లయంలో కలెక్టర్ను శనివారం కలిసి పూల మొక్కను అందించి అభినందించారు. కలెక్టర్ మాట్లాడు తూ రిటర్నింగ్ అధికారుల కృషి, వారు అందించిన సహకారం మరువలే నిదన్నారు. ఎన్నికల నిర్వహణలో సహకరించిన అధికారు లకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్మ పరిరక్షణలో భాగస్వాములైన మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు ఆయన తెలిపారు. స్ట్రాంగ్రూమ్స్ ఏర్పాటు, కౌంటింగ్ హాళ్ల ఏర్పాటుకు అన్ని విధాలా సహకరించిన సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్కు ధన్యవాదాలు తెలిపారు.