వృద్ధుడి మృతిపై నివేదిక కోరిన కలెక్టర్
ABN , Publish Date - Apr 06 , 2024 | 02:25 AM
మండలంలోని చీపురుగూడెంలో వడదెబ్బకు పింఛనుదారు మేకల తిరుపతయ్య మృతిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ స్పందించారు.
![వృద్ధుడి మృతిపై నివేదిక కోరిన కలెక్టర్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చాట్రాయి, ఏప్రిల్ 5: మండలంలోని చీపురుగూడెంలో వడదెబ్బకు పింఛనుదారు మేకల తిరుపతయ్య మృతిపై ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన కథనానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ స్పందించారు. నివేదిక ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. శుక్రవారం ఎంపీడీవో మంగాకుమారి, పంచాయతీ కార్యదర్శి నాగరాజు చీపురుగూడెం వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించి కలెక్టర్కి నివేదిక పంపారు.9