Share News

వాహనాల్లో తరలిస్తున్న రూ. 4.29 లక్షలు స్వాధీనం

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:43 AM

వాహనాల్లో తరలిస్తున్న 4.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ ప్రియకుమార్‌ తెలిపారు.

వాహనాల్లో తరలిస్తున్న రూ. 4.29 లక్షలు స్వాధీనం

కలిదిండి, ఏప్రిల్‌ 2 : వాహనాల్లో తరలిస్తున్న 4.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ ప్రియకుమార్‌ తెలిపారు. కలిదిండికి చెందిన గంపా రాజేష్‌ బుల్లెట్‌పై మంగళవారం రాత్రి రూ.3,59,960లు, కోరుకొల్లుకు చెందిన చావాకుల వెంకట రాజేష్‌ కారులో రూ.78,500 నగదును తరలిస్తుండగా, మద్వానిగూడెం చెక్‌ పోస్టు వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సహకారంతో పట్టుకున్నామ న్నారు. ఆధారాలు చూపకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:43 AM