Share News

బాస్కెట్‌బాల్‌ విజేతలు పశ్చిమగోదావరి, అనంతపురం

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:47 AM

నూజివీడులో జరుగుతున్న రాష్ట్రస్థాయి 9వ ఇంటర్‌ డిస్ర్టిక్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో విజేతలుగా పశ్చిమగోదావరి, అనంతపురం జట్లు నిలిచాయి.

బాస్కెట్‌బాల్‌ విజేతలు పశ్చిమగోదావరి, అనంతపురం
బాస్కెట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన పశ్చిమగోదావరి జిల్లా బాలికల జట్టు

నూజివీడు టౌన్‌, ఏప్రిల్‌ 23: నూజివీడులో జరుగుతున్న రాష్ట్రస్థాయి 9వ ఇంటర్‌ డిస్ర్టిక్‌ బాస్కెట్‌బాల్‌ చాంపియన్‌ షిప్‌ పోటీల్లో విజేతలుగా పశ్చిమగోదావరి, అనంతపురం జట్లు నిలిచాయి. తొలుత బాలికల విభాగంలో నిర్వహించిన ఫైనల్స్‌లో పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా జట్లు తలపడ్డాయి. ఆద్యంతం నువ్వా నేనా అనేలా పోటీ సాగగా, కేవలం ఒక్క పాయింట్‌ ఆధిక్యతతో పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లా జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. 49–48 స్కోరుతో కృష్ణాజిల్లా జట్టుపై పశ్చిమగోదావరి విజయం సాధించింది. బాలుర విభాగంలో సైతం పోటీ నువ్వా నేనా అనేలా సాగింది. అనంతపురం, తూర్పుగోదావరి జట్లు హోరాహోరీగా తలపడగా 76–74 స్కోరుతో అనంతపురం జట్టు తూర్పుగోదావరి పై విజయం సాధించి, ఫైనల్స్‌ విజేతగా నిలిచింది.

Updated Date - Apr 24 , 2024 | 12:47 AM