పిడుగుపాటుకు 4 గేదెల మృతి
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:56 AM
సోమవరంలో తోటలో చెట్టుకు కట్టేసి ఉన్న పెదలంక వరలక్ష్మికి చెందిన 4 గేదెలపై సోమవారం మధ్యాహ్నం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాయి.
![పిడుగుపాటుకు 4 గేదెల మృతి](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
చాట్రాయి, జూన్ 10: సోమవరంలో తోటలో చెట్టుకు కట్టేసి ఉన్న పెదలంక వరలక్ష్మికి చెందిన 4 గేదెలపై సోమవారం మధ్యాహ్నం పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాయి. గేదెల విలువ రూ. 1.50 లక్షలు ఉంటుందని బాధితురాలు వాపోయింది. వరలక్ష్మి కుటుంబ సభ్యులు తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటూ గేదెలను చెట్టుకు కట్టేశారు. ఉరుములు, మెరుపులతో భారీ వర్షం మొదలై పెద్ద శబ్దంతో చెట్టుపై పిడుగుపడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ప్రభుత్వం పరిహారం ఇప్పించి ఆదుకోవాలని బాఽధితులు కోరారు.