Share News

విద్యుదాఘాతానికి రెండు చూడిగేదెలు బలి

ABN , Publish Date - Jun 08 , 2024 | 12:26 AM

మండలంలోని లోపూడి గ్రామంలో విద్యుదాఘాతానికి రెండు చూడిగేదెలు మృతి చెందాయి.

 విద్యుదాఘాతానికి రెండు చూడిగేదెలు బలి

ముసునూరు, జూన్‌ 7: మండలంలోని లోపూడి గ్రామంలో విద్యుదాఘాతానికి రెండు చూడిగేదెలు మృతి చెందాయి. రైతులు పేరం గోపిరాజు, పేరం పుల్లయ్యలు శుక్రవారం తమ పశువులను పొలంలోకి మేతకు తోలుకువెళ్ళారు. బుధవారం రాత్రి ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి విద్యుత్‌ స్తతంభాలు విరిగి, తెగిపడిన తీగల్లో విద్యుత్‌ ప్రవహించడంతో అవి గేదెలకు తగిలి విద్యుదాఆఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాయి. ఒక్కొక్క గేదె విలువ రూ. 60 వేలు ఉంటుందని రైతులు వాపోయారు. వీఆర్వో పి.నవీన్‌కుమార్‌ నివేదికను తహసీల్దార్‌ జవహర్‌ బాబికి అందించగా నివేదికను ఉన్నతాధికారులకు పంపి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని తహసీల్దార్‌ తెలిపారు.

Updated Date - Jun 08 , 2024 | 12:26 AM